ఉమ్మడి కార్యాచరణపై జనసేన, టిడిపి నాయకుల బేటీ

రంపచోడవరం: టీడీపీ ఇంచార్జి వంతల రాజేశ్వరి ఆహ్వానం మేరకు శుక్రవారం ఆమె నివాసం వద్ద తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కాకి స్వామి మర్యాద పూర్వకంగా కలిశారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు రంపచోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి గారిని కలవడం జరిగింది. జనసేన-టీడీపీ పార్టీలు సమన్వయంతో కలిసి రంపచోడవరం నియోజకవర్గ పరిధిలో ఉన్న జనసేన పార్టీ మండల ఇంచార్జిలను కలుపుకొని నియోజకవర్గ పరిధిలో ముందుకు సాగాలని పార్టీ తరుపున మండల ఇంచార్జిల పేర్లను తెలియజేస్తు పిఆర్పీ శ్రీను రంపచోడవరం, రాయుడు దేవిపట్నం, కుంజం సిద్దు గంగవరం, దుర్గ ప్రసాద్ మరేడుమిల్లి, గంగాధర్ ఏటపాక, రాజు చింతూరు, సాయి కృష్ణ కునవరం, నరేంద్ర వి ఆర్ పురం, త్రిమూర్తులు రాజవొమంగి, జయరాం అడ్డతీగల మండల ఇంచార్జిల పేర్లను రాజేశ్వరికి ఇవ్వడం జరిగింది. జనసేన – టీడీపీ సమన్వయంతో కలిసి నియోజకవర్గ స్థాయిలోను ముందుకుసాగాలని ప్రతి కార్యక్రమంలో జనసేన -టీడీపీ కలిసి వెళ్లాలని ఆమెకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రంపచోడవరం మండలఅధ్యక్షులు పీఆర్పీ శ్రీను పాల్గొన్నారు.