శ్రీశ్రీశ్రీ భోగాంజనేయ స్వామి బ్రహోత్సవాలలో పాల్గొన్న యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం, నందలూరు మండలం నూకినేనిపల్లె గ్రామ పంచాయతీ కుంపిణీపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ భోగాంజనేయ స్వామి బ్రహోత్సవాలలో భాగంగా రథోత్సవం సందర్భంగా గ్రామ ప్రజలు మరియు జనసైనికుల ఆహ్వానం మేరకు రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు ముఖ్య అతిధిగా పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసారు. మంగళవాయిద్యాలు, పూలతో బాణాసంచా కాల్చుతూ ఘనస్వాగతం పలికి శాలువాతో సన్మానించిన గ్రామప్రజలు, జనసైనికులు. ఈ కార్యక్రమంలో కుంపిణీపురంకు చెందిన నందు, వెంకటసంబావు, ప్రసాద్ రాయల్, శివ, దినేష్, హరి మరియు మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, ఆకుల చలపతి, గురివిగారి వాసు, భారతాల ప్రశాంత్, తిప్పాయపల్లె ప్రశాంత్, పత్తి నారాయణ, నారదాసు రామచంద్ర, మహేష్, కార్తిక్, బాషా, సినీల్ గౌడ్, వినయ్, హర్షవర్ధన్, రాహుల్, హరి, నాని, మహేష్ తదితరులు పాల్గొన్నారు.