జనసేన ఉపాధ్యక్షులు నవీన్ కుటుంబానికి శంకర్ గౌడ్ పరామర్శ

జగిత్యాల నియోజకవర్గం: జగిత్యాల మండలంలోని దరూర్ గ్రామానికి చెందిన జనసేన మండల ఉపాధ్యక్షులు అంతడుపుల నవీన్ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకున్న తెలంగాణా రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జి నేమురి శంకర్ గౌడ్ నవీన్ కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడుతూ.. మీ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని, నవీన్ గారు ఇంత చిన్న వయసులోనే మరణించడం చాలా బాధాకరం. నవీన్ గారిని తిరిగి తీసుకురాలేం కానీ జనసేన పార్టీ తరుపున మీకు ఏ సమస్య వచ్చినా మేము మీకు అండగా ఉంటామని అన్నారు. అలాగే జగిత్యాల నియోజక వర్గ ఇంచార్జి బెక్కం జనార్దన్ గారు నియోజక వర్గ నాయకులు కార్య కర్తలు మీకు అన్ని వేళలా అందుబాటులో అండగా ఉంటారన్నారు. అలాగే నవీన్ గారికి పార్టీ సభ్యత్వ పరంగా పార్టీ తరుపున 5లక్షల వరకూ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరుపున మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల మండల అధ్యక్షులు బొల్లి రాము లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు చింత సుదీర్, పట్టణ ఉపాధ్యక్షులు కిరణ సింగ్, ప్రధాన కార్యదర్శి గట్ల శ్రీకర్ మహ్మద్ ఆజీ, రాయికల్ మండల అధ్యక్షులు కసావేని మల్లికార్జున్, ఉపాధ్యక్షులు పొన్నం రాకేష్, ప్రధాన కార్యదర్శి బత్తిని బాబు శివ కుమార్, మహిళా విభాగం మొగులోజి విజయ, పద్మ, స్వప్న, ధన మరియు కార్యకర్తలు తదిరతులు పాల్గొన్నారు.