అంగన్వాడీల ధర్నాకు జనసేన సంఘీభావం

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటిలో పి.ఏ.సి సభ్యులు & కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో భాగంగా నగరంలో ధర్నా చౌక్ వద్ద నెలకొల్పిన ధర్నా శిబిరాన్ని జనసేన పార్టీ శ్రేణులు సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీలు కొత్తగా ఏవీ కొర్కెలు కోరలేదనీ, అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరుతున్నారనీ అది తప్పా అని ప్రశ్నించారు. శాంతియుతంగా చేస్తున్న వారిని అధికారులతో బెదిరించడం, వారి కార్యాలయల తాళాలను బద్దలు కొట్టి వారి అదుపులోకి తీసుకోవడం చాలా దారుణమనీ, ఇలా ఆక్రమించిన కార్యాలయాలలోని ప్రజలకు సరఫరా చేసే సరుకులకి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేసారు. న్యాయమైన హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న అంగన్వాడీలకు తమ జనసేన పార్టీ తరపున కాకినాడ సిటిలో వారికి సంపూర్ణ సహాయ సహకారాలని అందచేయమని తమ పార్టీ పి.ఏ.సి సభ్యులు & కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ గారు ఆదేశించారనీ వారికి తెలియచేసారు. ఈ వై.సి.పి ప్రభుత్వానికీ, ఈ ముఖ్యమంత్రికీ ఇంక మిగిలింది మూడునెలలు మాత్రమేననీ ఆతరువాత వీళ్ళకి శంకరగిరిమాన్యాలే గతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, జనసేన నాయకులు మనోహర్ లాల్ గుప్తా, ఆకుల శ్రీనివాస్, సతీష్ కుమార్, పోలిశెట్టి రామారావు, బండి సుజాత, బట్టు లీల, చోడి పల్లి సత్యవతి, దీప్తి, సోనీ ఫ్లోరెన్స్ మొదలగు వారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *