నాదెండ్ల మనోహర్ మాట కాకినాడలో అందరి నోట

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటిలో పి.ఏ.సి సభ్యులు & కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో నాదెండ్ల మనోహర్ మాట కాకినాడలో అందరి నోటా కార్యక్రమంలో భాగంగా గురువారం కార్యక్రమం సంత చెరువు వద్ద రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి శివ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి దోచుకోవడానికి ఏ వర్గాన్ని వదలడం లేదని నాడు-నేడు పనుల్లోను, అదనపు గదులు పనుల్లోను, అలాగే ఫ్యాక్టరీలకు భూములు కేటాయింపులలోను, అలాగే అన్ని వర్గాల ప్రజలను ముంచి ఈ స్కాముల డబ్బులు అన్నీ కూడా తన ఖజానాల్లో దాచుకుంటున్నాడని ఈ అక్రమాలు అన్నీ కూడా జనసేన పార్టీ తరపున ప్రజలకు చైతన్యం చేసే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేయాల్సిన ముఖ్యమంత్రి అన్ని రంగాల ప్రజలను బాధపెడుతూ తాను మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పడం చాలా హాస్యాస్పదమని అలాగే వారి ఎమ్మెల్యేలు, సలహాదారులు రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అత్యంత మెజారిటీతో నెగ్గుతాడు అని చెప్పడం ఇంకా హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కనీసం జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉన్నదని కానీ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఈ అక్రమ సొమ్ముతో తన ఖజానాని నింపుకుంటున్నారని రాష్ట్ర ప్రజలు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తారని ఆయన ఆశాభవం వ్యక్తం చేశారు. జనసేన నాయకులు ఆకుల శ్రీనివాస్ మాట్లాడుతూ అన్ని వర్గాలనీ మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని, ఆయన ఎమ్మెల్యే లను ప్రజలు తిరగబడి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, ఈ జగన్ ప్రభుత్వం గద్ద దింపే వరకు వరకు తాము పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, నాయకులు పోలిశెట్టి రామారావు, కొమ్మిరెడ్డి చిన్ని, వాసిరెడ్డి సతీష్, మనోహర్, వరద దొరబాబు, శ్రీరామ్, సతీష్, వాసిరెడ్డి సూరి కుమార్, వీరమహిళలు సుజాత, దీప్తి, లీల, చౌడపల్లి సత్యవతి తదితరులు పాల్గొన్నారు.