రాజంపేట మండలంలో జనంలో జనసేన

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం రాజంపేట మండలంలో జనంలో జనసేన కార్యక్రమం కొమ్మివారిపల్లె, చుండువారిపల్లె, శవనవారి పల్లె, హరిజనవాడ, అరుంధతివాడ లలో జనసేన నాయకులు జనసైనికులు ఇంటింటికి ప్రచారం చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ఎన్నికల గుర్తు గాజు గ్లాస్ ను వివరించి కరపత్రాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ ద్వారా పరిష్కారం చూపుతామని జనసేన నాయకులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజంపేట జనసేన నాయకులు బాలసాయి కృష్ణ, ముత్యాల చలపతి, కోలాటం హరికృష్ణ, గాజుల మల్లిఖార్జున, బండ్ల నాగరాజు, పూల మురళి, ముత్యాల వెంకటసుబ్బయ్య, నరసింహ వర్ధంశెట్టి గురుప్రసాద్, కె నరసింహ తదితరులు పాల్గొన్నారు.