లాలుపురం జనసేన ఆఫీసుకి స్థలం ఇచ్చిన దాతలను సత్కరించిన డేగల లక్ష్మణ్

ప్రత్తిపాడు నియోజకవర్గంలోని లాలుపురం గ్రామంలో జనసేన ఆఫీస్ నిర్మించటానికి స్థలం ఇచ్చిన దాతలు సజ్జల రవి మరియు సజ్జల నరేష్ లను ఎప్పటినుండో సన్మానం చేయాలి అనే నా కోరిక సాధ్యపడింది. నేను సోమవారం లాలుపురం జనసేన పార్టీ ఆఫీస్ కి వెళ్లి జనసేన నాయకులు అయిన శ్రీను మాస్టారు, అదూరి శివ ప్రసాద్, శీలం శ్రీహరి, తోట శివ, తన్నీరు వాసుదేవరావు, తన్నీరు రాము, అక్కి రవి, తోట వెంకటేష్, పతేళ్ళ పెద్ద వీరయ్య మరియు కొంత మంది పెద్ధల సమక్షంలో వారు ఇరువురిని సన్మానించటం జరిగింది. తదనంతరం అందరకీ స్వీట్స్ తినిపించి వాళ్ళని సన్మానించటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, ఇంత గొప్ప ఆఫీస్ మన నియోజకవర్గంలో ఉండటం చాలా ఆనందదాయకం అని తెలియచేసి, ఆఫీస్ లో ఎలాంటి కార్యక్రమం తలపెట్టినా నా వంతు సహకారం అందిస్తానని అక్కడ ఉన్న పెద్దలకి జనసేన కార్యకర్తలకు చెప్పటం జరిగింది. ఇలాంటి ఆఫీసులు అన్ని చోట్ల నిర్మించుకుంటే బాగుంటుంది అని, పార్టీ అభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటుంది అని అందరం మాట్లాడు కోవటం జరిగింది. నాకు ఈ అవకాశానికి సహకరించిన లాలుపురం జనసేన కార్యకర్తలు అందరికి హృదయపూర్వక నమస్కారములు తెలుపుతున్నానని జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి డేగల లక్ష్మణ్ అన్నారు.