జనసేనలో చేరిన పాటు భాస్కర్

పలమనేరు నియోజకవర్గం: వి కోట మండలానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు పాటు భాస్కర్ జనసేనలో చేరడం జరిగింది. వారిని సోమవారం వి కోటలో తన ఆఫీసులో టీడీపీ నాయకులు ఏఎంసీ ఎక్స్ చైర్మన్ రామన్న మరియ జనసేన పార్టీ పలమనేరు నియోజకవర్గం ఇంఛార్జి పసుపులేటి దిలీప్ మర్యాద పూర్వకంగా కలిసి పార్టీ బలోపేతానికి రాబోయే రోజుల్లో చేయవల్సిన కార్యక్రమాలు గురించి చర్చించడం జరిగింది. కార్యక్రమంలో వి. కోట మండల నాయకులు ఆయాజ్ బాషా, హరి, సబ్రమని, గంగాధర్, భరత్, ప్రవీణ్, రూరల్ మండల అధ్యక్షులు నాగరాజు, కళ్యాణ్, పవన్, టీడీపీ యువత పట్టణ కార్యదర్శి మంజు పాల్గొన్నారు.