పేదల ఆకలి తీరుస్తున్న మోటూరి దంపతులకు ఘన సత్కారం

అమలాపురం: మదర్ తెరిసా అనాధ ఆశ్రమం వ్యవస్థాపకులు విక్టరీ వారి సంస్థ 19వ వసంతాలు పూర్తిచేసుకొని, 20వ వసంతంలోనికి అడుగుపెడుతున్న సందర్భంగా అమలాపురం పట్నంలో మున్సిపల్ ఆఫీసు ప్రాంత చర్చిలో విక్టరీ సంస్థ వార్షికోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో ఎంతోమందికి ఆకలి తీరుస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ప్రతి ఆశ్రమానికి అండగా ఉంటూ మరి ఎంతోమంది ఆకలి తీరుస్తున్న చిందాడగరువు ఎం.పి.టి.సి మోటూరి కనకదుర్గ, వెంకటేశ్వరరావు దంపతులను శాలువా కప్పి పూలదండతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం పట్టణ ప్రముఖులు న్యాయవాది ఉసిరి కృష్ణారావు, విక్టరీ సోదరులు, అనేకమంది పాస్టర్లు, ఏసుక్రీస్తు భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోటూరి దంపతులు మాట్లాడుతూ మా యొక్క సేవలను మీరు గుర్తించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే విక్టరీ దంపతులు మాట్లాడుతూ ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కొనియాడారు.