యడమ రాజేష్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

పటాన్‌చెరు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే విధంగా పటాన్ చెరువు జనసేన ఇంచార్జ్ యడమ రాజేష్ నాయకత్వంలో జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా పటాన్ చెరువు నియోజకవర్గం, బొల్లారం మున్సిపాలిటీలో హనుమాన్ టెంపుల్ నుంచి జ్యోతి థియేటర్ వరకు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యం జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలందరి వద్దకు తీసుకువెళ్లడం. తెలంగాణ అసెంబ్లీలో జనసేన గొంతు వినిపించే విధంగా నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా జనవాణీ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కదులుతూ.. రాజకీయ వ్యవస్థలో మార్పు దిశగా అడుగులు వేస్తుందని ఇంచార్జ్ రాజేష్ ఎడమ వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు మెగా అభిమానులు భారీగా పాల్గొన్నారు.