గరగలంపాలెంలో పలు కుటుంబాలను పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, గరగలంపాలెం గ్రామంలో పలు కుటుంబాలను గురువారం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించారు. ముందుగా గరగలంపాలెం గ్రామానికి చెందిన గోలకోటి శేషారత్నం ఇటీవల స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం తెలిపారు. అదే గ్రామానికి చెందిన తీగల దుర్గాప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోరుకొండ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అడ్డాల శ్రీను, కోరుకొండ మండల కన్వీనర్ మండపాటి శ్రీను, తన్నీరు తాతాజీ, రాయుడు శ్రీనివాస్, దండిపాటి గోవింద్, కవలపల్లి ప్రసాద్, పెద్దాడి చందు, గొలకోటి కొండబాబు, మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.