మైనారిటీల ఆత్మీయ సమావేశంలో నాదెండ్ల ను సత్కరించిన జనసేన నేతలు

  • చలో గుంటూరు

సత్తెనపల్లి నియోజకవర్గం: గుంటూరులో సోమవారం జరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో జనసేన ఆత్మీయ సమావేశంలో పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను జనసేన నాయకులు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు, పెంటేల బాలాజీ, కళ్యాణం శ్రీనివాసరావు (కె.కె), సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, నకరికల్లు మండల అధ్యక్షురాలు లక్ష్మీ శ్రీనివాస్, సత్తెనపల్లి మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నర్సయ్య మరియు సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.