ధీరేంద్ర కృష్ణ సర్కార్ శాస్త్రిని దర్శించుకున్న జనార్దన్

ఎచ్చెర్ల నియోజకవర్గం: ఎచ్చెర్ల జనసేన టీం కార్యకర్త బాడాన వెంకట జనార్దన్ రావు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ 2024లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ నిర్మల మనస్కుడై కలియుగ దైవంగా కొనియాడబడుతున్నటువంటి మధ్యప్రదేశ్ లో గల ఛత్రపూర్ జిల్లా గదా గ్రామంలో గల భాగేశ్వరి దామం బాలాజీ టెంపుల్ లో గల సర్కార్ మహారాజ్ ధీరేంద్ర కృష్ణ సర్కార్ శాస్త్రిని సోమవారం దర్శించుకుని నిర్మల మనస్కుడై తమ అధినాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ముఖ్యమంత్రి కావాలని ఒక మంచి పరిపాలన అందించాలని స్వామివారిని కోరడం జరిగింది. స్వామివారు చిరునవ్వుతో బాడాన వెంకట జనార్దన్ రావు యొక్క నిర్మలమైనటువంటి కోరికను మన్నించి భవిష్యత్తులో మీరు కోరుకున్నది జరుగుతుందని బాడాన వెంకట జనార్దన్ రావు గారిని ఆశీర్వదించడం జరిగింది.