పోలిశెట్టి కోటేశ్వరరావు కుటుంబానికి జనసైనికుల ఆర్థిక సహాయం

గుంటూరు: ఫిరంగిపురం మండలం నుదురుపాడు గ్రామంలో గల జనసైనికులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది. అందులో భాగంగా జనసేన పార్టీ కోసం ఎంతగానో శ్రమించిన పోలిశెట్టి కోటేశ్వరరావు మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబమును పరామర్శించడం జరిగింది. వారికి పార్టీ తోడుగా ఉంటుంది అనడానికి నిదర్శనంగా తడవర్తి కేశవరావు 10000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగినది. మరియు త్వరలో నుదురుపాడు గ్రామంలో జనసేన దిమ్మెను ఏర్పాటు చేయడం జరుగుతున్నది అని గ్రామస్థులు తెలియజేసారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శ్లులు తడవర్తి కేశవ, బందనాధం జ్యోతి, పూర్ణ, మండలం కార్యదర్శి అనిత, సత్య, నుదురుపాడు మరియు కండ్రిక జనసైనికులు పాల్గొన్నారు.