జనసైనికుల తిరుమల పాదయాత్రకు రాజంపేట జనసేన సంఘీభావం

రాజంపేట: 2024 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో బద్వేల్ నియోజకవర్గం, పోరుమామిళ్ల మండలం నుండి జనసేన నాయకులు జగన్ పోవాలి పవన్ రావాలి అంటూ తిరుమలకు పాదయాత్ర చేపట్టడం జరుగినది. ఈ పాదయాత్ర లో బాగంగా శుక్రవారం జనసేన నాయకులు రాజంపేట కు చేరుకోగా వారికి బోయినపల్లి వై జంక్షన్ దగ్గర రాజంపేట జనసేన నాయకులు స్వాగతం పలికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాజంపేట జనసేన నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేవలం పరదాల చాటున తన పాలన కొనసాగిస్తున్నారన్నారు. సమస్యలపై మాట్లాడాలంటే భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు పెట్టి మభ్య పెట్టడం, భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. కేవలం సంక్షేమ పథకాలు కూడా అనుకూలమైన వారికే పథకాలను అందిస్తున్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలో వచ్చి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకోవాలనే దృఢ సంకల్పంతో జనసేన నాయకులు, కార్యకర్తలు చేపట్టిన తిరుమల మహా పాదయాత్రను జయప్రదం చేయాలని, ఆ తిరుమల వెంకటేశ్వర ఆశీస్సులు తప్పక పవన్ కళ్యాణ్ కు కలగాలన్నారు. కార్యక్రమంలో పోరుమామిళ్ల నాయకులు వెంకటేష్, కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు శీలంశెట్టి లక్ష్మయ్య, పోరుమామిళ్ల మండలం నాయకులు సి పి నరసింహ, బద్వేల్ యువ నాయకులు, రాజంపేట నియోజకవర్గం నాయకులు సుండుపల్లి రెడ్డి రాణి, సానిపాయి, గుగ్గిళ్ళ నాగార్జున, వెంకటేష్, వీరయ్య, ఆచార్య, శంకరయ్య, రవి, మల్లికార్జున, పోలిశెట్టి శ్రీనివాసులు, జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.