యాక్సిడెంట్ అయిన జనసైనికుని కుటుంబానికి భరోసా ఇచ్చిన పేడాడ రామ్మోహన్ రావు

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం ఆమదాలవలస నియోజకవర్గం రెడ్డిపేట గ్రామ జనసైనికుడు చక్రవర్తికి యాక్సిడెంట్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీ పేడాడ రామ్మోహన్ రావు 10000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. అక్కడున్న డాక్టర్ గురుగుబెల్లి సందీప్ తో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. అలాగే ఆ కుటుంబంతో మాట్లాడి మీకు అండగా ఉంటానని భరోసా ఇవ్వడం జరిగింది. ఆయనతో పాటు పైడి ధనుంజయరావు, గోపి, జనసైనికులు ఉన్నారు.