జనం కోసం జనసేన 76 వ రోజు

“జనం కోసం జనసేన” కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా, లావేరు మండలం, కొత్తూరు పేట గ్రామంలో సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్ జనసేన పార్టీ జిల్లా నేత రాజకీయ అనుభవజ్ఞుడు కరిమజ్జి మల్లేశ్వరరావు పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలతో కరిమజ్జి మాట్లాడుతూ.. జనసేన పార్టీ సిద్ధాంత కర పార్టీ అని.. జనసేన మేనిఫెస్టో రాబోయే భావితరాలకు భవిష్యత్తు వారదని.. ప్రజా సంక్షేమమే పరమావధిగా లక్ష్యంగా పనిచేయుటకు పవన్ కళ్యాణ్ గారు సమర్థ నాయకుడిని.. కొనియాడారు రాబోయే రోజుల్లో కుల మత వర్గ విభేదాలు లేని మౌళిక వసతుల కల్పనకు పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తారని.. కాబట్టి ఆయనను మనమంతా రాబోయే ఎన్నికల నాటికి ముఖ్యమంత్రినీ చేయాలని కోరారు.. జనసేన పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ పై మీ సమర్థ ఓటు వేసి పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరచు వలసిందిగా అందరికీ పేరుపేరునా ధన్యవాదములు తెలియజేశారు.