ఉపాధి కూలీల మృతికి పేడాడ రామ్మోహన్ రావు ప్రగాఢ సానుభూతి

ఆమదాలవలస నియోజకవర్గం, మండాది గ్రామంలో ఆదివారం 3 గంటల సమయంలో కూలీలు ఉపాధి హామీ పనికోసం వెళుతుండగా అటుగా వస్తున్న ఇసుక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా గురువందల పాపమ్మ, అంబటి సత్తెమ్మ, కురమాల లక్ష్మి, అమలాపురం గౌరమ్మ, నలుగురు పైకి దూసుకు రావడంతో వారు అక్కడికక్కడే మరణించడం జరిగింది. వారిని పోస్టుమార్టం కి రిమ్స్ హాస్పిటల్ తరలించారు. విషయం తెలుసున్న ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు ఆ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.