విద్యార్ధుల సమస్యలపై బడి ముందు ధర్నా

*మధిర నియోజకవర్గ జనసేన విద్యార్ధి విభాగ నాయకులు వేముల వినయ్ కుమార్

బొనకల్ మండలం, గోవిందాపురం గ్రామంలో.. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అండగా నిలబడి వారి సమస్యలపై మీడియా ప్రతినిధులతో.. ఎం.ఈ.ఓ తో మాట్లాడటం జరిగింది. విద్యార్థుల సమస్యలపై ఎం.ఈ.ఓ సానుకూలంగా స్పందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కారంగుల లక్ష్మణ, గ్రామ సర్పంచ్ ఉమ్మినేని బాబు, ఉప సర్పంచ్ కారంగుల చంద్రయ్య, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.