సిపిఎస్ రద్దు విషయంలో ఉద్యోగస్తులకు అండగా జనసేన: డేగల దొరస్వామి నాయుడు

ఎన్నికల సమయంలో ఉద్యోగస్తులకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా.. బూటకపు మాటలు, అబద్ధపు హామీలు ఇచ్చి ఉద్యోగస్తులను మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. ఎవరికోసం ఈ బూటకపు మాటలు, ఎందుకోసం ఈ మాయ మాటలు అధికారం అందలం ఎక్కితే అహంకారం ఎక్కుతుందా? ప్రజాసమస్యలు తీరుస్తాం అని ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు న్యాయం చేయకపోగా.. కేవలం ఉద్యోగస్తులకు ఇచ్చిన సిపిఎస్ అంశం కేవలం నాటకమని ఉద్యోగస్తులకు ఇప్పుడు అర్థం అయింది. కానీ సిపిఎస్ రద్దు చేసే వరకూ ఉద్యోగస్తుల పోరాటం ఆగదు. సిపిఎస్ రద్దు విషయంలో ఉద్యోగస్తులకు అండగా జనసేన ఉంటుంది. ఉద్యోగస్తులను నేరస్థులుగా భావించిన ఘనత కేవలం జగన్ మోహన్ రెడ్డి గారిది. ఈ ప్రభావం 2024 ఎన్నికలలో ఘోర పరాభవాన్ని ఎదుర్కొనే విధంగా ఉద్యోగస్తులు చేయబోతున్నారు. ఇది మీరు గమనించాల్సిన విషయం ముఖ్యమంత్రి గారు. జనసేన పార్టీ నుంచి అప్పుల బాధలు పడలేక ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్న అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద అదే సామాజిక వర్గానికి చెందిన వీధికుక్కలతో సమానమైన మంత్రులను పోగేసి మీడియా ముందు కోతులు లాగా వెకిలి చేష్టలు చేసి.. వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. విర్ర వీగుతున్నారు. ఇంకొకసారి ఇదేవిధంగా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మీరు ఏ జాతికి చెందినవారో నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు కనుక ఇకనుంచి మీకు ఇచ్చిన మంత్రిత్వ శాఖలకు న్యాయం చేసే విధంగా ప్రజలకు అండగా ఉండి సమస్యలు తీరుస్తారని ముఖ్యమంత్రి గారికి, అంబటి రాంబాబు గారికి, గుడివాడ అమర్నాథ్ గారికి, దాడి రాజా గారికి, పత్రికాముఖంగా జనసేనపార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి డేగల దొరస్వామి నాయుడు తెలియజేశారు.