త్రాగునీటి సమస్యపై స్పందించిన దుర్గేష్ సేన

రాజమండ్రి రూరల్ కొంతమూరు గ్రామంలో వాంబే గృహాల కాలనీలో త్రాగటానికి మంచి నీరు లేక ఇబ్బంది పడుతున్న 144 కుటుంబాల అభ్యర్థన మేరకు జనసేన జిల్లా అధ్యక్షులు రాజమండ్రి రూరల్ ఇంచార్జ్ కందుల దుర్గేష్ సూచనల మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగు జాడల్లో నడిచే వ్యక్తి ధవళేశ్వరం జనసైనికుడు దారపు శివారెడ్డి ముందుగా స్పందించి పది రోజులు త్రాగునీటి వాటర్ ట్యాంకర్ పంపించడానికి ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధికార ప్రతినిధి యామన నారాయణ గౌడ్, జిల్లా కార్యదర్శి షేక్ అమిన, మండల ఉపాధ్యక్షులు ఎండి సలీమ్, మట్టపర్తి నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ నాగు, మండల కార్యదర్శి సూరపురెడ్డి శ్రీరామ్, మొండ్రేటి ప్రసాద్, షేక్ సులేమన్, వడ్డి రామకృష్ణ మరియు కొంతమూరు జనసైనికులు పాల్గొన్నారు.