ఎం.ఎల్.సి ఎన్నికల ప్రచారంలో కోనేటి హరివెంకటరమణ

శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి, పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోనేటి హరి వెంకట రమణ ఎమ్మెల్సి ఎన్నికల ప్రచార నిమిత్తం కదిరి పట్టణానికి వచ్చి మొదటి ప్రాధానత్య ఓటును వెయ్యాలని కదిరి పట్టణంలో కదిరి నియోజకవర్గం ఇంచార్జీ భైరవప్రసాద్ ని, పట్టణంలో ఉన్న ప్రముఖులను, ఉద్యోగస్తులను, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులను కలిసి పశ్చిమ రాయలసీమ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోనేటి హరివెంకటరమణ (హరి రాయల్) అభ్యర్థించారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కష్టాలు, అవాంతరాలు సృష్టించినా మొక్కవోని ధైర్యంతో అన్నీ భరించి సహించి పోటీ చేస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ అభిమాని కోనేటి హరి వెంకట రమణకి ఉద్యోగస్తులు, పట్టభద్రులు ఈనెల మార్చి 13వ తేదీన ఉదయం 8.00 నుంచి సాయంత్రం 4.00 గంటల వరకూ జరగబోయే ఎమ్మెల్సి ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును 15 సీరియల్ నెంబర్ ఎదురుగా మొదటి ప్రాధానత్య (1) ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నామని, 2014లో టీడీపీ 2019లో వైసీపీ ఈ రెండు పార్టీలు డిగ్రీలు పూర్తి చేసిన నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు ఈ రెండు పార్టీ చేసింది ఏమీ లేదు ఒక్క అవకాశం కోనేటి హరివెంకటరమణకి కల్పించండి అంటూ కదిరి నియోజకవర్గంలో కోర్టు ఆవరణంలో, ఎమ్మార్వో ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రచారం నిర్వహించడం జరిగింది.