జనసేన ఆశయ సాధన సభ విజయవంతం

సర్వేపల్లి: నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు సెంటర్ లో జనసేన ఆశయ సాధన సభ బహిరంగ సభను సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బోనుబోయిన ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి అధ్యక్షతన విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, నెల్లూరు సిటీ అధ్యక్షులు దుగ్గుశెట్టి సుజాయ్ బాబు, పార్టీ ఐటీ కో ఆర్డినేటర్ పసుపులేటి ప్రసాద్, సర్వేపల్లి నియోజకవర్గ 5 మండలాల అధ్యక్షులు తోటపల్లి గూడూరు మండల అధ్యక్షుడు అంకెం సందీప్, వెంకటాచలం మండలాధ్యకుడు మందా వెంకటేష్, మనుబోలు మండలాధ్యక్షుడు పెనుబాక ప్రసాద్, పొదలకూరు మండలాధ్యక్షుడు దాశినేటి అనిల్, మరియు ముత్తుకూరు మండల ప్రధాన కార్యదర్సులు పోలూరు పెంచల నరసింహా, కోడి మణికంఠ, చినకంగారి కసుమూరు, తాండ్ర శ్రీనివాసులు, పురిణి అంజి, వీరబాబు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరిగింది.