యాక్సిడెంట్ గురైన ఆదప్ప కుటుంబానికి జనసేన భరోసా

అనంతపురం జిల్లా, సింగనమల నియోజకవర్గం, బుక్కరాయసముద్రం మండలంలోని నీలారెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఆదెప్ప యాక్సిడెంట్ కు గురై తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో జాయిన్ అవ్వడం జరిగింది. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు అనంతపురం జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్, జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ ఆదేశాలతో బుక్కరాయసముద్రం మండల అధ్యక్షులు జి ఎర్రిస్వామి హాస్పిటల్ కి వెళ్లి ఆదప్ప ను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా మీకు జనసేన పార్టీ తోడు ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ బుక్కరాయసముద్రం మండల నాయకులు అరటి తాహిర్, దుస్సా ఏకాంత, మురళి తదితరులు పాల్గొనడం జరిగింది.