ప్రమాదానికి గురైన జనసైనికునికి ఆర్ధికసాయమందించిన పొందూరు జనసేన

రెడ్డి పేట, పొందూరు మండలం శ్రీకాకుళం జిల్లాలో జనసైనికులు ఇటీవల యాక్సిడెంట్ అయ్యి ఈఛూ ఉన్నారు, రోజుకి లక్ష రూపాయలు ఖర్చవుతుంది, పేద కుటుంబం అవ్వడం వల్ల, ఇబ్బందులకు గురవుతున్నారని, జనసేన పార్టీ నాయకులు తెలుసుకొని, పొందూరు జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో, ఆమదాలవలస నియోజవర్గం జనసేన నాయకులు మరియు కార్యకర్తల సహకారంతో 30000 రూపాయలు, జనసైనికుని తల్లిదండ్రులకి అందజేసి అన్ని విధాలుగా జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది. అంతటి గొప్ప కార్యక్రమానికి ముందుకు వచ్చి అన్ని విధాలుగా సపోర్ట్ చేసినటువంటి కోరుకొండ మల్లేశ్వరరావు, గులివిందల అశిరి నాయుడు, కొత్తకోట నాగేంద్ర, కొంచడా చిన్నం నాయుడు, గార బాబురావు, మన విక్రమ్ జనసేన ఎంపీటీసీ, జమాన అప్పలనాయుడు, యలకల రమణ, దూబ సంఘం నాయుడు, అనంత్, సంతోష్, టంకాల రమేష్ లకు హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మన ఆముదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రెడ్డిపేట జనసైనికులు పాల్గొన్నారు.