మహబూబాబాద్ జిల్లా ఎస్పీ మరియు ఎస్.పి.డి.ఓ అధికారులకు ధన్యవాదాలు తెలిపిన మేరుగు శివకోటి యాదవ్

నర్సంపేట, ట్వీట్ ద్వారా మహబూబాబాద్ జిల్లా ఎస్పిని ట్యాగ్ చేస్తూ జనసేన నాయకుడు మేరుగు శివకోటి యాదవ్ చేసిన విజ్ఞప్తికి స్పందించిన మహబూబాబాద్ జిల్లా ఎస్పి పోలీస్ అధికారులు – ఎస్.డి.పి.ఓ రీట్వీట్. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కొరవి మండలం అయ్యగారి పల్లి గ్రామంలో అన్యాయాన్ని ప్రశ్నించినందుకు జనసైనికుడు అనిల్ కుమార్ దేశ్ ముఖ్ పై ఆ గ్రామ అధికార పార్టీ సర్పంచ్ మరియు అతని యొక్క అనుచరుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా జనసేన పార్టీ నాయకులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జీ మేరుగు. శివకోటి యాదవ్ అనిల్ ని పరామర్శించి, స్థానిక కురవి పోలీస్ స్టేషన్లో అనిల్ వారిపై పెట్టిన కేసు వివరాల గురించి ఎస్సైతో మాట్లాడిన విషయం తెలిసిందే. కానీ అనిల్ గతంలో రెండు సార్లు వారిపై, వారు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, వారి వల్ల ప్రాణ భయం ఉందని ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకుండా స్థానిక పోలీస్ అధికారులు నిర్లక్ష్యం చేయడంతో… పోలీస్ అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకుడు మేరుగు.శివకోటి యాదవ్ మహబూబాబాద్ జిల్లా ఎస్పికికి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. దీనికి స్పందించిన మహబూబాద్ జిల్లా ఎస్.పి.డి.ఓ, పోలీస్ అధికారులు శివకోటి యాదవ్ కి ట్విటర్లో రీట్వీట్ చేస్తూ అనిల్ పై దాడి చేసిన వారిపై స్థానిక కురివి పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి రిజిస్టర్ చేశామని వైడ్ క్రైం నంబర్ 132/2023,మరియు కేసు విచారణలో ఉందని తెలుపడం జరిగింది. ఈ సందర్భంగా శివకోటి యాదవ్ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ మరియు ఎస్.పి.డి.ఓ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.