శ్రీశ్రీశ్రీ వరాహా లక్ష్మీనరసింహాస్వామి ఆలయం పునఃనిర్మాణం మరియు విగ్రహాప్రతిష్ట మహోత్సవంలో జనసేన

*జనసేనపార్టీ ప్రోధ్బలంతో తదేకం ఫౌండేషన్ వారి సహాకారంతో తిరుమలాయపాలెం గ్రామంలో శ్రీశ్రీశ్రీ వరాహా లక్ష్మీనరసింహాస్వామి ఆలయం పునఃనిర్మాణం మరియు విగ్రహాప్రతిష్ట మహోత్సవం

కొన్ని దశాబ్దాలు కాలంగా అసంపూర్ణంగా ఉన్న తిరుమలాయపాలెం శ్రీశ్రీశ్రీ వరాహా లక్మినరసింహస్వామి ఆలయాన్ని గ్రామస్తుల కోరికమేరకు మన జనసేనపార్టీవారు తదేకంపౌడేషన్ వారిని పరిచయం చేసి స్వామివారి ఆలయ అభివృద్ధి మేము చేస్తామని ఈ మహోత్తర ఆధ్యాత్మిక కార్యక్రమానికి దృఢసంకల్పంతో ముందుకు వచ్చి తదేకం ఫౌండేషన్ వారు ఆలయం పునర్నిర్మాణం సుమారు 20 లక్షల వ్యయంతో పూర్తి చేసి విగ్రహ ప్రతిష్టకి ఫౌండేషన్ వ్యవస్థాపకులు గురూజీ నౌషీర్ స్వయంగా విచ్చేశారు, శ్రీమతి మందలపు మాదవి, శ్రీమతి యార్లగడ్డ సాయిసుధ, జనసేనపార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, రాష్ట్ర పిఏసి సభ్యులు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజి ముఖ్య అతిధులుగా విచ్చేశారు మరియు జనసైనికులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.