రఘునాథపాలెం మండలంలో మిరియాల రామకృష్ణ ఎన్నికల ప్రచారం


తెలంగాణ, ఖమ్మం, బిజెపి బలపరిచిన జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి మిరియాల రామకృష్ణ సోమవారం ఎన్నికల ప్రచారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ప్రజలకు అభివాదం చేస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజేపి జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, జనసేన ఎన్నికల పర్యవేక్షకులు బండి నరేష్ జనసేన మండల కమిటీ, టౌన్ కమిటీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొని ప్రచారం చేశారు.