39వ డివిజన్లో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ: జనసేన భీమ్ యాత్ర జనసేన పార్టీ 39వ డివిజన్లో బండి సుజాత ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ సిటీ ఇన్చార్జ్ పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పిట్ట జానకిరామారావు మాట్లాడుతూ అఘాయిత్యాలలో ఆంధ్రప్రదేశ్ ని అగ్రస్థానంలో నిలబెట్టింది. ఈ వై.సి.పి ప్రభుత్వమని దునుమాడారు. సంక్షేమం చేయడం ప్రభుత్వ బాధ్యత అనీ దానిని తమ ప్రభుత్వ ప్రత్యేకత అనే రీతిలో తమఖాతాలో వేసుకోవడం ఈ వై.సి.పి ప్రభుత్వానికే చెల్లిందని ఎద్దేవా చేసారు. దళిత చిన్నారులకు మామయ్య అని చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి కాకినాడ సిటిలో ఎంతమంది దళితులకు ఇళ్ళు కట్టించారనీ, ఎంతమంది దళిత విధ్యార్ధులకి విదేశీ విద్యకి ఋణాలు మంజూరు చేసారో శ్వేతపత్రం విడుదలచేయమని డిమాండ్ చేసారు. దళితులపై ఈ వై.సి.పి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ప్రజలకు వివరిస్తూ పరుస్తూ స్థానికి అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కది మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు సేకరించారు. ఈ కార్యక్రమంలో వీరమహిళలు బోడపాటి మరియ,బట్టు లీల, దారపు శిరీష, దీప్తి, రమణమ్మ, ఉమా, జనసేన నాయకులు ఆకుల శ్రీనివాస్, ముత్యాల దుర్గాప్రసాద్, దారపు సతీష్, రవిశంకర్ పచ్చిపాల మధు, సమీర్, కాశ్మీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.