కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో జనసేన భీమ్ యాత్ర

కాకినాడ సిటి: జనసేన భీమ్ యాత్ర గురువారం 37వ డివిజన్ అంబేడ్కర్ భవన్ నుండి బండి సుజాత ఆధ్వర్యంలో కాకినాడ సిటీ ఇన్చార్జ్ & పీఏసీ సభ్యులు ముత్తా శశిధర్ నాయకత్వంలో నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పిట్ట జానకిరామారావు మాట్లాడుతూ ఎస్.సి & ఎస్.టి సబ్-ప్లన్ నిధులు సంగతి ఈ వై.సి.పి ప్రభుత్వం చెప్పలనీ దీనిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలన్నారు. ఇంకా ఎంతకాలం దళితులని మోసం చేస్తూ మభ్యపెడతారని ప్రశ్నించారు. దళితులని ఈ ముఖ్యమంత్రి తన అవసరాలకు వాడుకుని తదుపరి మొహంకూడా చూడటంలేదన్నారు. దళితులకి చదువులు అబ్బితే ఎక్కడ బాగుపడతారో అని తమకు అందుబాటులో ఉండే ప్రభుత్వ స్కూళ్ళను సైతం దిక్కుమాలిన వంకలతో విలీనాలు, మూసివేతలు చేసి వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. తదుపరి స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి మట్టిని ముంబైలోని ఆయన స్మారక స్థూపం వద్ద పెట్టడం కొరకు సేకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ, వీరమహిళలు బండి సుజాత, భవాని, సోని ఫ్లోరెన్స్, మరియా, దీప్తి, సత్యవతి, జనసేన నాయకులు బలసాడి శీను, రమణ, శంకర్, వాశిరెడ్డి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.