అరకులో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

పాడేరు నియోజకవర్గం: పెదబయలు మండలం కేంద్రంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ ఆధ్వర్యంలో మండల మండల కేంద్రంలో ఘనంగా జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. వేడుకలలో భాగంగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేయడం జరిగినది. పేదలకు పులిహోర పంచడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చేస్తున్న పనితీరు ఏ విధంగా ఉందో మీకు అందరికీ తెలిసిందే కావున రానన్న రోజుల్లో జనసేన ప్రభుత్వం వస్తే మనమందరం కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటదని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన మండల నాయకులు, కార్యకర్తలు, పి ప్రశాంత్, అంజి, మధు, నాగరాజు, మహేష్, కళ్యాణ్, హరీష్, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు.