రాజోలులో విజయం సాధించి బి ఫామ్ అందుకున్న జనసేన అభ్యర్ధులు

తూర్పుగోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గం పడమటిపాలెంలో ఎంపిటిసి జనసేన అభ్యర్ధిగా పోటి చేసిన దొండపాటి సుజాత 1400 ఓట్ల మెజారిటీతో , బట్టేలంకలో శివ జ్యోతి 84 ఓట్లతో ఘనవిజయం సాధించి బి ఫామ్ అందుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో మలికిపురం ఎంపీపీ మేడిచర్ల వాణి రాము, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శులు దిరిసాల బాలాజీ , తాడి మోహన్, గుండుబోగుల పెదకాపు, గుండా బత్తులు తాతాజీ, గెడ్డం మహాలక్ష్మి, ఆకుల చిన్న వెంకయ్య నాయుడు, పొన్న ప్రభ, ఎనుముల వెంకట పతిరాజ, పినిశెట్టి బుజ్జి, బోనం సాయి, ఉలిశెట్టి లక్ష్మణరావు, బాబీ నాయుడు, కుంచె పండు, నాగ రాజు మరియు జనసైనికులు పాల్గొన్నారు.