ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో పాల్గొన్న శెట్టిబత్తుల రాజబాబు

అల్లవరం: ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి పురస్కరించుకొని కోనసీమ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అమలాపురం నియోజకవర్గంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో మరియు అల్లవరం మండలం కొమరగిరిపట్నంలో జరిగిన విప్లవజ్యోతి శ్రీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతి మహోత్సవంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు పాల్గొని.. సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి ప్రసంగించారు. అనంతరం కొమరగిపట్నం స్థానిక క్షత్రియ యువత రాజబాబుని శాలువా కప్పి సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కొమరగిపట్నం జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.