తిమ్మాపురంలో జనసేన చలివేంద్రం

కళ్యాణదుర్గం, కంబదూరు మండల అధ్యక్షులు చంద్రమౌళి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తరుపున చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కంబదూరు మండలంలోని తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కు వివిధ పనుల నిమిత్తం విచ్చేస్తున్న ప్రజల దాహార్తిని తీర్చుట కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని జన సైనికులు సురేష్, నరేష్, రమేష్, అర్జున్ తదితరులు తెలిపారు.