యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ లో నేరస్తులను కఠినంగా శిక్షించాలి

పాతగాజువాక, శుక్రవారం రాత్రి బజాజ్ షోరూం పైన 21ఏళ్ల వయసుగల యువతిపై జరిగిన గ్యాంగ్ రేప్ లో.. నేరస్తులను కఠినంగా శిక్షించాలని, హత్యా చారానికి గురైన అమ్మాయికి న్యాయం చేయాలని..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంఘటన జరిగిన ప్లేస్ వద్ద రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు గాజువాక ఇంచార్జ్ కోన తాతారావు ఆధ్వర్యంలో వైజాగ్ సిటీ “దిశ” పోలీస్ ఏసిపి శ్రీమతి ప్రేమ్ కాజల్ ని జనసేన పార్టీ బృందం కలిసి దర్యాప్తు వేగవంతం చేయాలని డిమాండ్ చేయుట జరిగింది. ఈ బృందంలో నియోజకవర్గాల ఇంచార్జిలు పివిఎసెన్ రాజు, శ్రీమతి పసుపులేటి ఉషా కిరణ్, లీగల్ సెల్ కార్యదర్శి కరణం కళావతి, పార్టీ నాయకులు లంకల మురళీదేవి, దాసరి జ్యోతిరెడ్డి, మాక శాలిని, రామలక్ష్మి, ఏడిద భార్గవ, సాయి తదితరులున్నారు.