ఆలకూరపాడు రోడ్డుని మరమ్మత్తులు చేయాలని జనసేన డిమాండ్

  • వైసిపి చేస్తుందా…? లేక జనసేనని చేయమంటారా…?
  • ఈ రహదారి విషయంలో మాట తప్పని మడమ తిప్పని నాయకులు ఎక్కడికి పోయారు…?

కొండపి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైసిపి ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో టంగుటూరు మండలంలో టంగుటూరు నుండి ఆలకూరపాడు వరకు ఉన్నటువంటి ప్రధాన రహదారి ప్రతినిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది, ప్రస్తుతం ఈ రహదారి అస్తవ్యస్తంగా గుంతలగుంతలుగా మారి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, అధికారులు మరియు నాయకులు చూస్తూ ఉన్నారు తప్ప ఈ రహదారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు, వైసిపి నాయకులు బహిర్గతంగా ఈ ఆలకూరపాడు రహదారిని మరమ్మత్తులు చేయలేమని చెబితే, జనసేన నాయకులు చందాలు వేసుకుని మరమ్మత్తులు చేయటానికి సిద్ధంగా ఉన్నారు, ఈ రహదారిన్ని మరమ్మత్తులు చేసే విషయంలో మాట తప్పని మడమ తిప్పని నాయకులు ఎక్కడికి పోయారు. ఇప్పటికైనా అధికారులు మరియు వైసిపి నాయకులు మేలుకుని ఈ ఆలకూరపాడు ప్రధాన రహదారిన్ని మరమ్మత్తులు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు లింగంగుంట చంద్రవాస్, ఐయినాబత్తిన రాజేష్, గూడా శశిభూషణ్, అత్యల సురేష్ బాబు, బడుగు నాగార్జున, నూతలపాటి సురేష్, అవినాష్, సయ్యద్ కాజా హుస్సేన్ లు పాల్గొన్నారు.