జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన తంబళ్లపల్లి రమాదేవి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ, బుధవారం నందిగామలో జనసేన-టిడిపి సమన్వయ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తంబళ్లపల్లి రమాదేవి జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంబళ్లపల్లి రమాదేవి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేస్తున్నానని, పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, అధిష్టానం నిర్ణయాన్ని శిరసా వహిస్తానని, అధిష్టానం ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే రేసులో తప్పకుండా ఉంటానని ఆమె అన్నారు. ఎమ్మెల్యే స్థానం అన్నది చాలా విలువైనది ఆస్థానంలో ఉంటే ఏ పని అయినా చేయవచ్చు ప్రజలకు న్యాయం చేయవచ్చు ఆ పదవికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తానని తంబళ్లపల్లి రమాదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.