త్రాగునీరు వెంటనే విడుదల చేయాలని జనసేన డిమాండ్

రాజాం నియోజకవర్గం, రేగిడిఆమదాలవలస మరియు రాజాం మండలంలో గత 3 రోజులుగా త్రాగునీటి సరఫరా నిలిపివేయడం అయినది. ఈ సమస్యకు పరిష్కారం దిశగా రాజాం జనసేన నాయకులు ఎన్ని రాజు మరియు జనసైనికులు సంబంధిత బొడ్డవలస పంప్ హౌస్ ను సందర్శించి, తదుపరి రేగిడి ఆమదాలవలస మండలంలో అధికారులకు సమస్యను వివరించారు. సమస్య పరిష్కారం దిశగా కార్యాచరణ చేయవలసినదిగా ఎంపిడిఓ కార్యాలయం వెళ్లి తెలియచేయడంజరిగింది. సమ్మెకు కారణమైన పంపుసెట్ కార్మికులకు రావలసిన 14 నెలల వేతనాలను వెంటనే చెల్లించి, వెంటనే త్రాగు నీరు విడుదల చేయవలసినదిగా జనసేన పార్టీ తెలియజేసింది.