సిసి రోడ్ డ్రైనేజ్ త్వరితగతిన పూర్తి చేయాలని జనసేన డిమాండ్

విజయనగరం నియోజకవర్గం 9వ డివిజన్ స్థానిక కోట్ల మాదప్ప వీధి నుండి రాధాస్వామి స్కూల్ వరకు 31 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్ డ్రైనేజ్ దాదాపు రెండు సంవత్సరాలు అయినా ఇంకా పూర్తి కాలేదు. వెంటనే చర్యలు తీసుకుని రోడ్డు పనులు పూర్తిచేయాలని జనసేన పార్టీ 9వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి హుసేన్ ఖాన్ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి స్థానిక సచివాలయంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళ పుష్ప కుమారి, జన సైనికుడు విశ్వ, భవాని, పండు తదితరులు పాల్గొన్నారు.