కాలువ పైపు బ్లాక్ సమస్యని త్వరగా పరిష్కరించాలని జనసేన డిమాండ్

అనంతసాగరం మండలం, అమాని చిరివెళ్ల పంచాయతీ మేకరవారి పల్లి గ్రామంలోని కాలువ పైపు బ్లాక్ అయి రోడ్డుమీద మురికి నీళ్ళు ప్రవహిస్తూ, ప్రజలకు రాకపోకలు చాలా ఇబ్బందిగా మారింది. ఈ సమస్యపై ప్రజలు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోని గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి. ఈ సమస్య త్వరగా పరిష్కరించాలని జనసేన పార్టీ అనంతసాగరం మండల అధ్యక్షులు మస్తాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం జరిగింది.