మహాశివరాత్రి సందర్భంగా పులిహోర ప్యాకెట్లు మరియు 600 లీటర్లు మజ్జిగ పంపిణీ

పిఠాపురం, జనసేన పార్టీ, లయన్స్ క్లబ్ సఖి తరఫున పిఠాపురం మండలం, చిత్రాడ గ్రామంలో మహాశివరాత్రి పురస్కరించుకొని పాదగయ క్షేత్రమునకు వచ్చే భక్తులకు యాత్రికులకు పులిహార ప్యాకెట్లు, 600 లీటర్లు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని పులిహార మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా శేషుకుమారి మాట్లాడుతూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపి ప్రజలందరకి ఈశ్వరుని ఆశీస్సులు ఉండాలని ప్రార్థించారు. లయన్స్ క్లబ్ సఖి జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, అందులో భాగంగా శనివారం సావిత్రి మావయ్య బ్రహ్మాజీరావు మరియు ఎస్.వి.రమణ, మావయ్య బాలయ్య, అత్తయ్య రాములమ్మల జ్ఞాపకార్థం మహా శివరాత్రిని పురష్కరించుకుని పులిహోర ప్యాకెట్లు , మజ్జిగ పంపిణీ చెయ్యడం అభినందనీయం అన్నారు. లయన్స్ క్లబ్ సఖి రీజినల్ చైర్పర్సన్ నాగలక్ష్మి మాట్లాడుతూ సఖి క్లబ్ మరియు శేషుకుమారి తరుపున పిఠాపురం నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు, పేద వారికి ఆహారదానం నిర్వహించడం చాలా అనందంగా ఉందని అలాగే జనసైనికులకు నాయకులకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి, లయన్స్ క్లబ్ సఖి రీజనల్ చైర్ పర్సన్ ఎన్.నాగలక్ష్మి, క్లబ్ నెంబర్స్ ఎస్.వి రమణ, ఏ.అమ్మాజీ, జనసేన జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, గోపు సురేష్, బుర్రా సూర్యప్రకాశరావు, బావిశెట్టి నందీశ్వర రావు, దేశిరెడ్డి సతీష్, బసవా గోపి, నంద్యాల జాను, నాగం మధు, పెంకే జగదీష్, పెంట వెంకటేష్, కేసారపు స్వామి, యాగ సతీష్, బక్కన్న, కాళ్ళ రాము, బసవా సతీష్, రాజు, చిత్రాడ నాయకులు జనసైనికులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.