రోళ్ళ మండలాధ్యక్షులు రంగస్వామి ఆధ్వర్యంలో మండల కమిటీ ఏర్పాటు

మడకశిర, రోళ్ళ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు రంగస్వామి ఆధ్వర్యంలో మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికీ ముఖ్య అతిథిగా జిల్లా సంయుక్త కార్యదర్శి ఆనంద్ కృష్ణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పల్లె పల్లెనా జనసేనపార్టీ జెండా ఎగరవేద్దామని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కావాలంటే పల్లెలే పట్టుకొమ్మలని కావున ప్రతి గ్రామంలో పర్యటించి పార్టీలో మరింత మందిని చేర్చుకునే విధంగా ప్రణాళిక రచించాలని అన్నారు. మండల కమిటీ నిర్మాణం చేపట్టేటప్పుడు ప్రతి పల్లె నుండి క్రియాశీలక జనసైనికులను గుర్తించి వారికి కూడా సమూచిత స్థానం కల్పించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు రంగ స్వామి గోపీనాథ్, ఉదయ్ కుమార్, రమేష్ బాబు రెడ్డి, విరేష్ చంద్, భాష, నాగేష్, బసవేశ్వర కుమార్, హనుమంత్ తదితరులు పాల్గొన్నారు.