చదలవాడలో జనసేన నాయకులు మీద దాడిచేసిన ఎస్ఐ మీద చర్య తీసుకోవాలని జనసేన డిమాండ్

మార్కాపురం, చదలవాడలో జనసేన నాయకులు మీద దాడి చేసిన ఎస్ఐ మీద చర్య తీసుకోవాలని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక గార్గ్ ని కలిసి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది, ఈ సందర్బంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ మార్కాపురం ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాధ్ మాట్లాడుతూ మా నాయకులు పెంట్యాల కోటి, భూపతి మురళి మీద దాడి చేసిన ఎస్ఐ మీద చర్య తీసుకోవాలని సోమవారం ఎస్పీని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎస్పీ కూడా సానుకూలంగా స్పందించారు. విచారణ చేసి వారం రోజుల్లో తగు చర్యలు తీసుకుంటామని మాకు హామీ ఇచ్చారు. మాకు ఎస్పీ మీద నమ్మకం ఉందని మరియు మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నామని అధికారపార్టీకీ తొత్తుగా వ్యవహరిస్తున్న ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని లేనిపక్షంలో ధర్నాకైనా ఆందోళనకైనా దిగుతామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ఒంగోలు జనసేన పార్టీ కార్పొరేటర్ మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి రాయని రమేష్, రాష్ట్ర కార్యక్రమల కార్యనిర్వహణ కార్యదర్శి బత్తుల రామకృష్ణ, చదలవాడ ఎంపీటీసీ పామిడిముక్కల శివకృష్ణ, చీమకుర్తి మండల అధ్యక్షులు శివ, మరిపూడి మండలం అధ్యక్షులు మారిశెట్టి చంద్రశేఖర్ మరియు జనసేన నాయకులు నరేంద్ర పోకల, ధనుష్ కొణిజెటి, ఈదుపల్లి మని, భూపతి రమేష్, ముత్యాల సురేష్, మనోజ్ రాయల్స్, అనుదీప్, సాయి, సుభాని, మాల్యాద్రి నాయుడు, పాలెం సురేష్, సాయి కుమార్, మరియు జనసేన వీరమహిళలు ప్రమీల, కోమలి, ఉష తదితరులు పాల్గొన్నారు.