రామ్ సుధీర్ ఆధ్వర్యంలో జనసేన డిజిటల్ క్యాంపెయిన్

పెడన, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు నాదెండ్ల మనోహర్ గార్ల పిలుపు మేరకు, మొద్దునిద్ర పోతున్న వై ఎస్ జగన్ ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు పెడన జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ ఆధ్వర్యంలో పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం మల్లపురాజు గూడెం గ్రామంలోని పాడైపోయిన రోడ్డు దుస్థితిని తెలియచేసేందుకు #ఘూదంఒర్నింగ్ఛంశిర్ హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సుబ్బయ్య, దివి శ్రీనివాస్, కొఠారి మళ్ళి, సయ్యద్ షఫీ, శివ, పవన్ మరియు మల్లపు రాజు గూడెం జనసైనికులు పాల్గొన్నారు.