ప్రభుత్వం మొద్దునిద్ర వీడి రోడ్లు వేయాలి: కే.ఎల్.డి జనసేన డిమాండ్

కళ్యాణదుర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో రెండవరోజు #GoodMorningCMSir కార్యక్రమం శనివారం నిర్వహించడం జరిగింది. కళ్యాణదుర్గం నుంచి బ్రహ్మసముద్రం ప్రధాన రహదారిలో రోడ్లన్నీ గుంతల మాయమై అద్వాన స్థితిలో అయ్యాయి.. వర్షాకాలం ఐతే మరి దారుణంగా తయారు అవుతాయి… ఇక్కడ చాలా ప్రమాదాలు కూడా తరుచూ జరుగుతుంటాయి.. ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు.. అంబులెన్స్ వెళ్లడానికి కూడా సౌకర్యం లేదు… ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వదిలి రోడ్లు వేయాలని కే.ఎల్.డి జనసేన పార్టీ డిమాండ్ చేయడం జరిగింది… ఈ రోడ్లపై స్థానిక ఎమ్మెల్యే గారు తిరుగుతున్న ఏమాత్రం పట్టించుకోవడం లేదు… ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, జనసేన నాయకులు రాఘవేంద్ర ఏర్రి స్వామి, వీర మహిళ షేక్ తార, జాకీర్ వంశీ, మహేష్ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది…