“మత్స్యకారులకు బాసటగా జనసేన” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన పితాని

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం, బలుసుతిప్ప, తాళ్లరేవు మండలం రామన్నపాలెం పలు మత్స్యకార గ్రామాలలో జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ గురువారం పర్యటించడం జరిగింది. మత్స్యకారులకు బాసటగా జనసేన పార్టీ ఈనెల 28 వ తేదీన ఉదయం 10 గంటలకు కాకినాడ ఏటిమొగ గ్రామంలో గల మత్స్య శాఖ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆద్వర్యంలో జనసేన నేతలతో కలసి మత్యకార సమస్యల పరిష్కారం కోసం విజ్ఞాపన కార్యక్రమం తలపెట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా మత్స్యకారులు అందరూ కలిసి రావాలని జనసేన రాష్ట్ర పి.ఎ.సి సభ్యులు, ముమ్మిడివరం పార్టీ ఇన్ ఛార్జ్ పితాని బాలకృష్ణ కాట్రేనికోన, తాళ్లరేవు, మండలాలలోని తీరప్రాంత మత్సకార గ్రామాలలో పర్యటించి మత్స్యకారులు అందరూ సంఘటితంగా ఈ కార్యక్రమానికి‌ హాజరుకావాలని, అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమ్హిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.