రాయలసీమ జోనల్ కమిటీ జనసేన సభ్యునిగా ములభాగల్ రమేష్

పలమనేరు: జనసేన పార్టీ 2024లో జరగనున్న ఎన్నికల కార్యక్రమాల నిర్వహణకు సంబంచిన జోనల్ కమిటీలను పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ ఆదివారం విడుదల చేశారు. రాయలసీమ జోనల్ కమిటీ సభ్యునిగా పలమనేరు నియోజకవర్గంకు చెందిన ములభాగల్ రమేష్ కు అవకాశం కల్పించిన సందర్భంగా రమేష్ మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారికి, పలమనేరు నియోజకవర్గం (ఇన్ ఛార్జ్) పసుపులేటి దిలీప్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నానని తెలిపారు.