బాధిత కుటుంబాలకు అండగా జనసేన

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా బాధిత కుటుంబాలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని పలు బాధిత కుటుంబాలను ఓదార్చి, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో భాగంగా అకాల మరణంతో మృతిచెందిన గుత్తుల వెంకట్రావు, గుత్తుల సురేష్, పసుపులేటి దుర్గారావు కుటుంబాలను పరామర్శించారు. అలాగే ఇటీవల అనారోగ్యానికి గురైన పురాణపండ రామ్మూర్తిని కలసి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ధైర్యాన్ని నింపారు. ఆయన వెంట జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళ డేవిడ్, జనసేన నేతలు కట్టా రాజు, పెట్టా రంగనాథ్, లంకే సతీష్, దాసి మోహన, చల్లా వెంకటేశ్వరరావు, శిరిగినీడి పట్టాభి, లంకె ధన కృష్ణ, కొప్పాడి జయరాజ్ , కోట వరలక్ష్మి, పెద్ద సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.