ఆనారోగ్యానికి గురైన మహిళకు జనసేన ఆర్థికసాయం

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడ గ్రామంలో జనసైనికులు పర్యటించారు. కళింగుల పేటలో నిరుపేదమహిళ యశోద గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యముతో బాధపడుతున్నారు. జనసేనపార్టీ ఆమెను కలిసి ఆవిడకు కొన్ని నిత్యావసరసరుకులు, కాయగూరలు మరియు కొంత ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో యెరుబండి చిన్ని జనసేన వార్డు మెంబెర్, బొంతు సుధాకర్, నక్కా రామారావు, పెదపూడి శ్రీను, రుద్రా తాతాజి, యెరుబండి మణి, రామకృష్ణ, శ్యామ్, బంగారం తదితర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.