రేగిడి రాము కుటుంబానికి జనసేన ఆర్దిక సాయం

చీపురుపల్లి నియోజకవర్గం: మెరకముడిదాంలో రేగిడి రాము జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఇటీవల అకాల మరణం చెందారు. వారి కుటంబానికి జనసేన పార్టీ తరుపున జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యణ్ ఆశయ సాధనకై చీపురుపల్లి నియోజకవర్గ జనసేన నాయకులు జమ్ము ఆదినారాయణ శుక్రవారం కీర్తి శేషులు రేగిడి రాము ఇంటికి చీపురుపల్లి నియోజకవర్గం జనసేన నాయకులుతో కలిసి వెళ్లి నియోజకవర్గం లో ఉన్న జనసైనికులు అందరూ కలిసి ఎన్.అర్.ఐ లతో కలిపి చందాలు వేసుకున్న 32000 రూ.ల చెక్కును రేగిడి లక్ష్మణ బంటుపల్లి శంకరరావు మరియు స్థానిక జడ్పీటీసీ కాండిడిట్ సాసుబిల్లి రామునాయుడు ఆధ్వర్యంలో చెక్కును రేగిడి రాము కుటంబానికి అందచెయ్యడం జరిగింది. వాటితో పాటుగా కీర్తి శేషులు రాము ఇద్దరు పిల్లలకి చదువు నిమ్మత్తం సరిపడా పుస్తకాలు కిట్టును అందచెయ్యడం జరిగింది. అంతేకాకుండా పిల్లల చదువుపూర్తి అయినంతవరకు పుస్తకాలను పూర్తిగా అందిస్తానని జమ్ము ఆదినారాయణ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిగ తవిటినాయుడు, సిగ రమణ, చీపురుపల్లి కిరణ్ కుమార్, దేబార్కి మోహన్ తో పాటు జనసేన పార్టీ నుండి కొందరు నాయకులు అలాగే కొందరు అభిమానులు పాల్గొన్నారు.